బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమూడు రెట్లు పెరిగిన సైబర్‌ నేరాలు !

1 గంట క్రితం

Cybercriminals siphon off money from ASI's account.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 29, 2026, 08:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : దేశంలో సైబర్‌ ‌నేరాలు మూడు రెట్లు పెరిగాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్‌‌కు తెలియచేసింది. 2020లో సైబర్‌ ‌మోసాల సంఖ్య 10,395 వుండగా, 2024నాటికి ఈ సంఖ్య 29,758కి పెరిగిందని పేర్కొంది. గతేడాదిలో తెలంగాణాలో ఈ నేరాలు ఎక్కువగా నమోదయ్యాయి. 2024లో గుర్తించిన కేటగిరీల్లో ఆన్‌‌లైన్‌ ‌బ్యాంకింగ్‌ ‌మోసం ప్రధానంగా వుంది. ఈ కేటగిరీ కింద 4659 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానంలో క్రెడిట్‌ ‌కార్డ్‌ ‌లేదా డెబిట్‌ ‌కార్డ్‌ ‌మోసాలు వున్నాయి. ఇక వరుసగా మార్కెటింగ్‌ ‌లేదా పెట్టుబడుల మోసాలు (3044), ఎటిఎం మోసం (1659), మోసపూరిత కాల్‌ (1264), గేమింగ్‌ ‌యాప్‌ ‌లేదా వెబ్‌‌సైట్‌ ‌మోసాలు (1019), ఒటిపి మోసాలు(965), ఇ వాలెట్‌ ‌లేదా యుపిఐ మోసాలు (723) వున్నాయి. రాష్ట్రాలవారీగా చూసినట్లైతే తెలంగాణాలో 2024లో రికార్డు స్థాయిలో ఈ తరహా కేసులు 18,922 నమోదయ్యాయి. ఆ తర్వాత స్థానాల్లో బీహార్‌ (4020), మహారాష్ట్ర (2827), ఒరిస్సా (1546) వున్నాయి. అయితే ఈ కేసుల్లో ఎంత మొత్తం డబ్బు నష్టపోయారు లేదా రికవరీ చేసారనే వివరాలకు సంబంధించిన డేటాను జాతీయ నేర గణాంకాల బ్యూరో (ఎన్‌‌సిఆర్‌‌బి) రూపొందించలేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ ‌రాజ్యసభలో రాతపూర్వక సమాధానంలో తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్