బుధవారం, 09 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమసీదుల కూల్చివేతలు, మైనార్టీలపై దాడులు దురదృష్టకరం

1 రోజు క్రితం

omar abdullah
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 12:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • జమ్మూకాశ్మీర్‌ సిఎం ఒమర్ అబ్దుల్లా

శ్రీనగర్‌ : దేశంలో మసీదుల కూల్చివేతలు, మైనార్టీలపై దాడులు దురదృష్టకరమని జమ్మూకాశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. "ఇది ఒక దురదృష్టకరమైన పరిస్థితి. ముస్లింలను బయటివారిగా, ఇతరులుగా చూస్తుండటం.. మసీదుల కూల్చివేత అయినా లేదా వారిపై దాడులైనా, రెండూ అత్యంత దురదృష్టకరం. ఇలా జరగకూడదు" అని అబ్దుల్లా స్పష్టం చేశారు. శ్రీనగర్‌‌లో సోమవారం జరిగిన మొదటి అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందర్భంగా మాట్లాడుతూ అబ్దుల్లా ఈ వ్యాఖ్యలు చేశారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో ఆయన ఇటీవల జరిపిన సమావేశం గురించి మాట్లాడుతూ "అనేక సమస్యలపై షాతో చర్చలు జరిగాయి" అని అబ్దుల్లా తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్