న్యూఢిల్లీ : ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు చెందిన సుమారు 5,000 మంది పైలట్లకు డోప్ టెస్ట్ను తప్పనిసరి చేయాలని యాజమాన్యం నిర్ణయించింది. ఫుకెట్-ఢిల్లీ విమాన ఘటనలో పైలట్-ఇన్-కమాండ్ గంజాయి సేవించినట్లు తేలిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పైలట్లకు శిక్షణ సమయంలో, విమాన విధులు ముగిసిన తర్వాత కూడా పరీక్షలు నిర్వహించనున్నట్లు సంస్థ ఉద్యోగులకు తెలిపింది. ప్రయాణికుల భద్రత, విమాన సేవల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యమని పేర్కొంది.
Print Editionఎయిరిండియా పైలట్లందరికీ డోప్ టెస్ట్ తప్పనిసరి
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 13, 2026, 09:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)