- 5.5 తీవ్రత నమోదు
లేహ్: జమ్మూకశ్మీర్లోని లడఖ్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైంది. జాతీయ భూకంప శాస్త్ర కేంద్రం ప్రకారం.. లేహ్లో ఉదయం 6:05 గంటలకు భూకంపం సంభవించింది. భూమికి సుమారు 10 కిలోమీటర్ల లోతులో ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప కేంద్రాన్ని అధికారులు ఇంకా నిర్ధారించాల్సి ఉంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం అందలేదు. పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు.








కామెంట్లు (0)