మంగళవారం, 14 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

సమోసా కోసం రైలు ఆపిన లోకో పైలట్!

5 రోజుల క్రితం

train
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 11:49 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- వైరల్ వీడియోపై వివరణ

ఇండోర్: సమోసాల కోసం ఓ లోకో పైలట్‌ రైలును ఆపినట్లు సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై పశ్చిమ రైల్వే వివరణ ఇచ్చింది. ఈ ప్రచారం పూర్తిగా అసత్యమని తెలిపింది. సమోసాలు కొనడం కోసమే లోకో పైలట్‌ రైలును ఆపలేదని పేర్కొంది. ముందున్న ట్రాక్‌పై జరుగుతున్న ఇంజినీరింగ్ పనుల కారణంగా అధికారులు ఈ రైలును సిగ్నల్ వద్ద నిలిపేశారని తెలిపింది. ఆ సమయంలోనే అసిస్టెంట్‌ లోకో పైలట్‌ రైలు నుంచి దిగి సమోసాలు కోనుగోలు చేశాడని వెల్లడించింది. అధికారికంగా అనుమతించిన చోట రైలు ఆగినప్పటికీ.. ఉద్దేశపూర్వకంగా కొందరు వ్యక్తులు దీనిపై తప్పుడు ప్రచారాలు చేశారని స్పష్టతనిచ్చింది.


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్-మౌ మధ్య నడిచే డెమో రైలు లోకో పైలెట్ సమోసాలు కొనుగోలు చేయడానికి రైలు దిగాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కొందరు స్థానికులు లోకో పైలెట్ కేవలం సమోసాల కోసమే రైలు ఆపాడని వ్యాఖ్యానించగా, రైల్వే అధికారులు దీనిపై విచారణకు ఆదేశించి ఫ్యాక్ట్ చెక్ చేసి వివరణ ఇచ్చింది.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్