- ముందంజలో ఉన్న రాష్ట్రాల్లో ఎపి
న్యూఢిల్లీ : నీతి ఆయోగ్ మొట్టమొదటిసారిగా 'ఇన్వెస్ట్మెంట్ ఫ్రెండ్లీనెస్ ఇండెక్స్ 2026'ను విడుదల చేసింది. దేశంలో 28 రాష్ర్టాలు, ఎనిమిది కేంద్రపాలిత పాంత్రాలపై నిర్వహించిన ఒక సర్వే ఆధారంగా శుక్రవారం ఈ ఇండెక్స్ను విడుదల చేశారు. 84 అంశాల ఆధారంగా 1,850 మందికి పైగా పెట్టుబడిదారులను సర్వే చేయడంతో పాటు, 165 మంది వాటాదారుల నుండి వచ్చిన సూచనల ఆధారంగా దీన్ని రూపొందించినట్లు నీతి ఆయోగ్ తెలిపింది. ఈ ఇండెక్స్లో 100కి 56.6 స్కోరుతో గుజరాత్, 53.7 పాయింట్లతో మహారాష్ర్ట, 53.3 పాయింట్లతో తమిళనాడు తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. తరువాత స్థానాల్లో గోవా, ఒడిషా ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలను అగ్రశ్రేణి రాష్ట్రాలుగా పేర్కొన్నారు. ముందంజలో ఉన్న, అభివృద్ధి చెందుతున్న, ఆకాంక్షగల రాష్ట్రాలు అనే విభాగాలను కూడా పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ సహా 15 రాష్ట్రాలను ముందంజలో ఉన్న రాష్ట్రాలుగా పేర్కొన్నారు.








కామెంట్లు (0)