విజయవాడ : వాంగ్చుక్ దీక్ష భగ్నం చేయడం నిరంకుశమని, కేంద్రం తక్షణమే చర్చలకు పిలవాలి అని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి శనివారం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర విద్యాశాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరవధిక నిరాహారదీక్ష చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, పర్యావరణ ఉద్యమకారుడైన సోనమ్వాంగ్చుక్ దీక్ష భగ్నం చేసి బలవంతంగా ఆసుపత్రికి తరలించడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నదన్నారు. పరీక్షల నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి నిరంకుశ చర్యలకు పాల్పడటం దారుణమన్నారు. ఉద్యమకారులతో కనీసం చర్చలకు సిద్ధపడకుండా దేశ పరీక్షల వ్యవస్థ, విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురాకుండా 21 రోజుల దీక్షను భగ్నం చేయడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం అని ధ్వజమెత్తారు. ఉద్యమం ఆగిపోకుండా కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, ఎస్ఎఫ్ఐ అఖిలభారత నాయకులు ఆదర్శ్ ఎం సాజి, ఐషీ ఘోష్ నిరవధిక నిరాహార దీక్షను కొనసాగించడం హర్షణీయం అని అభినందించారు. ఇప్పటికే సిపిఐ(యం) సీనియర్ నాయకులు బృందాకరత్ వారికి సంఘీబావం ప్రకటించారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తక్షణం ఆందోళన చేస్తున్న నాయకులతో చర్చించాలని కోరారు. పార్లమెంట్ సమావేశాల్లోలాగానే ప్రధాన్తో రాజీనామా చేయించాలి లేదా అతన్ని బర్తరఫ్ చేయాలని, ఇకనైనా ప్రవేశ పరీక్షలు సవ్యంగా జరగడానికి వీలుగా వికేంద్రీకరించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తున్నదని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు.
వాంగ్చుక్ దీక్ష భగ్నం చేయడం నిరంకుశం, కేంద్రం తక్షణమే చర్చలకు పిలవాలి : సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 18, 2026, 04:58 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు






కామెంట్లు (0)