మంగళవారం, 01 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దేశ ప్రజలకు మళ్లీ విజ్ఞప్తి చేసిన ప్రధాని మోడి

1 గంట క్రితం

Prime Minister Modi makes another appeal to the people of the country.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 01, 2026, 11:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

న్యూఢిల్లీ : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్- జూన్) లో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదు కావడంపై ప్రధాని మోడి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధానమంత్రి ... గతంలో చేసిన విజ్ఞప్తినే మరోసారి గుర్తు చేశారు. స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని, విదేశీ ప్రయాణాలు వద్దని, అవసరం లేకుండా బంగారం కొనొద్దని మళ్లీ కోరారు. ప్రస్తుతం కిర్గిస్థాన్ పర్యటనలో ఉన్న మోడి ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ లో వీడియో విడుదల చేశారు. “ దేశ ప్రజలకు అభినందనలు. 7.8 శాతం వృద్ధి గొప్ప విషయం. ప్రజల సంకల్ప బలం, కృషికి ఇది నిదర్శనం. ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న సమయంలో భారత్ ఈ అసాధారణ ఘనతను దక్కించుకుంది. ప్రపంచం యుద్ధంలో మునిగిపోయింది. ఎటుచూసినా యుద్ధ వార్తలే.. సంక్షోభాలే. సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతింది. 2020లో కొవిడ్ తర్వాత నుంచి నేటి వరకు ఎక్కడా స్థిరత్వం కనిపించడం లేదు. అయినా భారత్ పురోగమిస్తోంది ” అని మోడి తన వీడియోలో పేర్కొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్