గురువారం, 16 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionబ్యానర్‌ ప్రదర్శన సంబరాలు వివాదాస్పదం

1 గంట క్రితం

banner
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 16, 2026, 11:22 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయ‌ర్లు వివాదాస్ప రీతిలో బ్యాన‌ర్లు ప్ర‌ద‌ర్శించారు. ఇంగ్లండ్‌తో జ‌రిగిన సెమీఫైన‌ల్ మ్యాచ్‌లో గెలిచిన త‌ర్వాత అర్జెంటీనా ఆట‌గాళ్లు ఫాక్‌ల్యాండ్స్‌కు మ‌ద్ద‌తు ఇచ్చే రీతిలో ఉన్న బ్యాన‌ర్‌ను మైదానంలో పట్టుకొని సంబరాలు చేసుకున్నారు. దీనిపై వివాదం చెల‌రేగింది. ‘లాస్ మాల్వినాస్ స‌న్ అర్జెంటీనాస్’ అని బ్యాన‌ర్‌లో రాసింది. అర్జెంటీనాకే ఫాక్‌ల్యాండ్స్ చెందుతాయ‌న్న అర్థం వ‌చ్చే రీతిలో బ్యాన‌ర్ ఉన్న‌ది. అట్లాంటిక్ స‌ముద్రంలో ఉన్న ఫాక్‌ల్యాండ్స్ దీవులు ఒక‌ప్పుడు బ్రిట‌న్ ఆధీనంలో ఉన్నాయి. అయితే ఆ దీవులు త‌మ‌కే చెందుతాయ‌ని అర్జెంటీనా పోరాడుతోంది. ఈ నేప‌థ్యంలో అర్జెంటీనా ఫుట్‌బాల్ ప్లేయ‌ర్లు .. బ్యాన‌ర్లు ప్ర‌ద‌ర్శించ‌డం వివాదానికి దారి తీసింది. 1982లో ఈ రెండు దేశాల మ‌ధ్య ఆ దీవుల కోసం యుద్ధం కూడా జ‌రిగింది. ఆ యుద్ధంలో వంద‌ల సంఖ్య‌లో ప్ర‌జ‌లు ప్రాణాలు కోల్పోయారు. 2014లో అర్జెంటీనా ప్లేయ‌ర్లు ఇలాగే ఓ వివాదాస్ప‌ద బ్యాన‌ర్‌ను ప్ర‌ద‌ర్శించారు. అప్పుడు ఆ జ‌ట్టుకు 20 వేల పౌండ్లు జ‌రిమానా వేశారు. అయితే తాజాగా జ‌రిగిన ఘ‌ట‌న ప‌ట్ల ద‌ర్యాప్తు చేప‌ట్ట‌నున్న‌ట్లు ఫిఫా అధికారులు చెబుతున్నారు. ఆట‌గాళ్లు నియమావ‌ళిని ఉల్లంఘించిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్