విజయనగరం కోట :నవయుగ వైతాళికుడు కందుకూరి వీరేశలింగం పంతులని శ్రీనివాస్ ఆర్ట్స్ అకాడమీ ప్రధాన కార్యదర్శి ఆర్బి రామానాయుడు, నారాయణ పబ్లిక్ స్కూల్ కరపాండెంట్ మొయిద నారాయణరావు అన్నారు. సోమవారం స్థానిక నారాయణ పబ్లిక్ స్కూల్లో కందుకూరి వీరేశలింగం పంతులు 176వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సంద ర్భంగా రామా నాయుడు విద్యార్థులు వీరేశ లింగం వేష ధారణ తో అలరించారు.