ప్రచారం చేస్తున్న టిడిపి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి
పుట్టపర్తి అర్బన్ : ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడే కొద్దీ టిడిపి, వైసిపి నాయకులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. టిడిపి అభ్యర్థి పల్లె సింధూరరెడ్డి శనివారం మున్సిపాలిటీ పరిధిలోని ప్రశాంతి గ్రామ్లో ఇంటింటికీ వెళ్లి చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా బికె.పార్థసారధిని ఎంపిగా గెలిపించాలని అభ్యర్థించారు. గ్రామాల్లో మహిళలు ఆమెపై పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఆమె మాట్లాడుతూ గత ఐదేళ్లు రాష్ట్రంలో అరాచక పాలన సాగిందని, బడుగు బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. రాష్ట్రం అప్పుల పాలైందన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని, దుద్దుకుంట శ్రీధర్రెడ్డి తన ఆస్తులను పెంచుకున్నారని ప్రజలకు వివరించారు. ఆమె వెంట అంబులెన్స్ రమేష్, గణేష్చౌదరి, గజ్జల వెంకటరాముడు, మహిళలు పాల్గొన్నారు. ఇక వైసిపి అభ్యర్థి దుద్దుకుంట శ్రీధర్రెడ్డి తరఫున ఆయన సతీమణి అపర్ణరెడ్డి పట్టణంలోని పెద్ద బజార్లో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఆమెకు వైసిపి నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆమె ఇంటింటికి వెళ్లి పుట్టపర్తి నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలంటే మరోమారు దుద్దుకుంట శ్రీధర్రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. ఆమె వెంట మున్సిపల్ ఛైర్మన్ తుంగ ఓబుళపతి, పుడా ఛైర్పర్సన్ లక్ష్మీనరసమ్మ, మున్సిపల్ వైస్ ఛైర్మన్ లక్ష్మీనారాయణరెడ్డి, కౌన్సిలర్లు సాయిగీత, చెరువు భాస్కర్రెడ్డి, సూర్యగౌడ్, నాయకురాళ్లు కవితరెడ్డి, వడ్డే భారతి, భాస్కర్ పాల్గొన్నారు.