ప్రజాశక్తి- కడప అర్బన్ వైఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈనెల 10న నగరంలో పర్యటించనున్న నేప థ్యంలో ఆయా ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఎస్పి సిద్దార్థ్ కౌశల్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం కడప నగరంలో ముఖ్యమంత్రి నిర్వహించనున్న సభా స్థలిని పరిశీలించారు. హెలిప్యాడ్, సెవెన్ రోడ్స్ కూడలి, టవర్ క్లాక్ ప్రాంతాలను పరిశీలించి ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన బందోబస్త్ ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సంద ర్భంగా ఎస్పి మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఆదే శించారు. నిరంతరం అప్రమత్తంగా ఉం టూ విధులు నిర్వర్తించాలని సూచించారు. కార్యక్ర మంలో ఎఆర్ అదనపు ఎస్పి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.