పర్యాటకులతో రద్దీగా ఉన్న కోడూరు తీరం
కోడూరు తీరంలో పర్యాటకుల సందడి..!
ప్రజాశక్తి- తోటపల్లిగూడూరుజిల్లాలోని పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన పర్యాటకుల తో మండలం లోని కోడూరు సముద్ర తీరం ఆదివారం రద్దీగా మారింది. ఈ సందర్బంగా తీరం వెంబడి సందడి వాతావరణం ఏర్పడింది. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు కోడూరు తీరానికి తరలి వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పర్యాటకుల రాకపోకలు సాగాయి. కుటుంబాల సమేతంగా వచ్చి తీరం వెంబడి సందడి చేశారు. యువత ఆటపాటలతో సందడి చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు సంభవించ కుండా తీరం వెంబడి ఎస్ఐ జంపాని కుమార్ ఆధ్వర్యం లో గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు.
![కోడూరు తీరంలో పర్యాటకుల సందడి..!](https://prajasakti.com/wp-content/uploads/2024/06/30-tpg-111.jpg)