మంత్రిని సన్మానిస్తున్న నాయకులు
పెనుకొండ టౌన్ : మంత్రి సవితను ఉమ్మడి అనంతపురం జిల్లా కురుబ సంఘం నాయకులు ఆదివారం పెనుకొండలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన తండ్రి రామచంద్రారెడ్డి అడుగుజాడల్లో నడిచి ప్రజాసేవలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సవిత మంత్రి కావడం గర్వకారణంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రాజహంస శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.