విఆర్ పురం (అల్లూరి) : మండలంలోని రాజపేట పంచాయతీలో ఉన్న సీతంపేట గ్రామంలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదానికి గురైన ఇంటి కుటుంబ సభ్యులను సిపిఎం కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం పరామర్శించింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ కారం లక్ష్మి, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూణెం.సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం.చిన్నబాబు హాజరయ్యారు. వీరు మాట్లాడుతూ …భారీ ఆస్తి నష్టం జరిగిందని, కట్టుబట్టలతో బయటపడ్డ బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పార్టీ తరఫున బియ్యం కట్ట, సామాగ్రి సహాయం, చీరలు, లుంగీలు, టవల్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పంకు.సత్తిబాబు, కారం.సుందరయ్య, లక్ష్మణరావు, వడ్లది.రమేష్, గుటాల శ్రీనివాసరావు, సోడి.మల్లయ్య, కుంజ.కిరణ్, తాతబాబు, శ్రీనివాసరావు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.