ప్రజాశక్తి-కారంచేడు : అంగన్వాడీల సమ్మెలో భాగంగా సోమవారం నాడు సంక్రాంతి పండుగ సందర్భంగా కారంచేడులో నిరసన పొంగలి కార్యక్రమం నిర్వహించారు. గత నెల రోజులు పైగా జరుగుతున్న అంగన్వాడీల ఆందోళన సందర్భంగా సోమవారం నాడు కారంచేడు తాసిల్దార్ కార్యాలయం వద్ద కట్టెల పొయ్యి వెలిగించి దానిపై సంక్రాంతి పొంగలి తయారు చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి మారు మనసు పొంది అంగన్వాడీల డిమాండ్లు నెరవేర్చి సమ్మె పరిష్కారం చేసి అందరికీ మంచి చేయాలని వారు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
![anganwadi workers strike 35day pongal festival bapatla](https://prajasakti.com/wp-content/uploads/2024/01/anganwadi-workers-strike-35day-pongal-festival-bapatla-a.jpg)