ప్రజాశక్తి – కశింకోట : కశింకోట మండలం తాళ్లపాలెం హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు అనకాపల్లి నియోజకవర్గ వైఎస్సార్ పార్టీ ఇన్ చార్జీ మలసాల భరత్ కుమార్ చేతుల మీదుగా ట్యాబ్ లు పంపిణీ కార్యక్రమం సోమవారం జరిగింది. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మీ గున్నయ్య నాయుడు, పార్టీ అధ్యక్షులు మలసాల కిషోర్, ఎంపీటీసీ సభ్యులు భవాని గణేష్, ఇందల ముసలి నాయుడు, పాల సంఘం అధ్యక్షులు గుమ్మడి నారాయణరావు , చిన్ని రాజీవ్, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు విజయలక్ష్మి పాల్గొన్నారు.