ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలో 30 మంది ఐపిఎస్ అధికారులను బదిలీ చేశారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఇద్దరు అదనపు డిజిలు, ఇద్దరు ఐజిలు ఉన్నారు.