ప్రజాశక్తి-యర్రగొండపాలెం: పుల్లలచెరువు మండలం అక్కపాలెం గ్రామంలోని పది వైసీపీ కుటుంబాలు టిడిపిలో చేరాయి. వీరంతా గురువారం యర్రగొండపాలెంలోని టిడిపి కార్యాలయానికి వచ్చి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరి ఎరిక్షన్బాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. టీడీపీలో తగిన గౌరవం, గుర్తింపు కల్పిస్తామని ఎరిక్షన్బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల కన్వీనర్ పయ్యావుల ప్రసాద్, నాయకులు బివి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.