ఫొటో : ట్యాబ్లు పంపిణీ చేస్తున్న ఎంఇఒ శ్రీనివాసులు
ట్యాబ్లు పంపిణీ
ప్రజాశక్తి-ఉదయగిరి : మండలంలోని 8వ తరగతి చదువుతున్న అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల విద్యార్థులకు జగనన్న బైజూస్ ట్యాబ్స్ను ఎంఇఒ-2 తోట శ్రీనివాసులు పంపిణీ చేశారు. 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు జగనన్న ట్యాబ్స్ను మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉదయగిరి బిసి ఉర్థూ, ప్రాథమిక ఉన్నత పాఠశాల వెంకట్రావుపల్లి, ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉదయగిరి, గురుకుల పాఠశాల గండిపాలెం పాఠశాలకు ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
![ఫొటో : ట్యాబ్లు పంపిణీ చేస్తున్న ఎంఇఒ శ్రీనివాసులు](https://prajasakti.com/wp-content/uploads/2024/01/udg-3-3.jpg)