ప్రజాశక్తి – సీతంపేట : మండలంలోని పెదరామలో ప్రకృతి వ్యవసాయ విభాగ రీజనల్ అధికారి కృష్ణారావు, జిల్లా ప్రకృతి వ్యవసాయ విభాగ డిపిఎం షణ్ముఖరాజు ఆధ్వర్యంలో ఆరోగ్య పోషణ్ కార్యక్రమం ఫుడ్ బాస్కెట్ ప్రారంభించారు. ఇందులో భాగంగా రీజనల్ అధికారి, డిపిఎం ఆరోగ్య పోషక విషయంపై గర్భిణులకు, బాలింతలకు, పిల్లలకు అలాగే అందరికీ ఎలా ఉపయోగపడుతుందనే విషయంపై వివరించారు. ఆ తర్వాత అదే గ్రామంలో ఎన్.శ్యామసుందర్రావు రైతు వేసిన ఎటిఎం మోడల్ను పరిశీలించి అందులోని లోటుపాటులను గుర్తించి రైతులకు వివరించారు. అలాగే దిగుబడి, వచ్చిన ఆదాయ వ్యయాల కోసం అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత దోనుబాయి యూనిట్ బూర్జలో జీల్లకర్ర మధుసూదనరావు రైతు వేసిన పలు పంటలు మోడల్ సందర్శించి దిగుబడి, ఆదాయ వ్యయాల గురించి అడిగి తెలుసుకున్నారు. అందులో ఉన్న లోటుపాట్లను గుర్తించి తగిన సలహాలు, సూచనలు ఇచ్చారు. కార్యక్రమానికి మార్కెటింగ్ ఎన్ఎఫ్ఎ తిరుపతి, ఐటిడిఎ ఎన్ఎఫ్ఎ ముసలయ్య, హెచ్ఎన్ ఎన్ఎఫ్ఎ శోభారాణి, డివిజన్ ఎంఎఫ్టి బాలు, ఎన్ఎఫ్ఎఫ్ స్వప్న, మండల్ యాంకర్ సత్యనారాయణ, ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్ఛార్జిలు నరేష్, ధర్మ తదితరులు పాల్గొన్నారు.