ప్రజాశక్తి-మద్దిపాడు: మండల పరిధిలోని పలు గ్రామాలలోని పోలింగ్ స్టేషన్లను జెసి ఆర్ గోపాలకృష్ణ గురువారం పరిశీలించారు. దొడ్డవరం, పెద్దకొత్తపల్లి, లింగంగుంట, మద్దిపాడులో గల పోలింగ్ స్టేషన్లను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అదే విధంగా చెక్ పోస్టులను తనిఖీ చేశారు. ఏమైనా ఇబ్బందు లు ఉంటే తమ దృష్టికి వెంటనే తీసుకురావా లన్నారు. జెసి వెంట తహశీల్దారు అనురాధ, ఎండిఓ శ్రీహరి, రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు.