ప్రజాశక్తి-దర్శి: ప్రతి ఇంటికి కుళాయి వేసి ప్రతి ఒక్కరికీ రక్షిత నీరు ఇవ్వటమే తమ ప్రభు త్వ లక్ష్యమని దర్శి నియోజకవర్గ తెలుగు దేశం కూటమి ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. సోమవారం స్థానిక కురి చేడు రోడ్లోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాల యం వద్ద ఎన్టీఆర్ జలసిరి పథకాన్ని గతంలో మూతపడగా దానిని తిరిగి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబునాయుడు నాయకత్వాన అందరికీ ఆమోదయోగ్యమైన ప్రభుత్వం ఏర్పడిందని, అన్ని విధాలా నియోజకవర్గం అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ సందర్భంగా పథకాన్ని ప్రారంభించి మంచినీటిని బిందెలకు పట్టి మహిళలకు అందించారు. ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, వైస్ చైర్మన్ తలారి కోటయ్య, కమిషనర్ వై మహేశ్వరరావు, దారం సుబ్బారావు, హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/2-5.jpg)