ముంద స్తు క్రిస్మస్ వేడుకల దశ్యం
ముందస్తు క్రిస్మస్ వేడుకలు
ప్రజాశక్తి-తోటపల్లిగూడూరు : మండలంలోని సౌత్ ఆములూరు ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం ముందస్తు క్రిస్మస్ సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రధానోపాధ్యాయులు షేక్. అ హ్మద్ బాషా ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అహ్మద్ బాషా మాట్లాడుతూ విభిన్న మతాలకు పుట్టినిల్లు భారతదేశమని తెలిపారు. శాం తా క్లాజ్ వేషధారణలో విద్యార్థులు అలరించారు. అనంతరం చక్కని క్రిస్మస్ నత్యాల తో పాఠశాలల విద్యార్థులు సందడి చేశారు. పాఠశాల కమీటీ ఛైర్మన్ ఆర్. స్వాతి, ఉపాధ్యాయులు ఎం. ము రళి, కె. వసంత లక్ష్మి, బి.క ష్ణవేణి ఉన్నారు.