విజేతగా అమనాం బాల్ బర్నర్స్, రన్నరప్గా చిప్పాడ కూల్ థండర్స్
ప్రజాశక్తి-తగరపువలస : భీమిలి మండలం, మూలకుద్దులో చిప్పాడ దివీస్ సంస్థ ఆధ్వర్యంలో నెల రోజులుగా నిర్వహిస్తున్న దివీస్ చాలెంజర్స్ క్రికెట్ మెగా టోర్నీ మంగళవారంతో ముగిసింది. మండలంలోని 12 పంచాయతీల నుంచి 32 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ విజేతగా అమనార బాల్బర్నర్స్ జట్టు నిలిచింది. రన్నరప్ చిప్పాడ కూల్ థండర్స్ జట్టు నిలిచినట్లు నిర్వాహకులు తెలిపారు.విజేతలకు దివీ స్ సంస్థ ఎండి మురళీకృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్వి రమణ, జిఎం వైఎస్ కోటేశ్వరరావు, సిఐ డి.రమేష్ , సిఎస్ఆర్ మేనేజర్ సురేష్కుమార్ జ్ఞాపికలు, నగదు బహుమతులు అందజేశారు.దివీస్ సంస్థ ఆధ్వర్యంలో విజేత అమనాం జట్టుకు రూ 50 వేలు, రన్నరప్ చిప్పాడ జట్టుకు రూ.25 వేలు, మూడు నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లకు చెరో రూ.పది వేలు, మ్యాన్ ఆఫ్ది సీరిస్గా ప్రతిభ చాటిన క్రీడాకారునికి రూ.ఐదు వేలు నగదు బహుమతులు అందజేశారు గ్రామీణ యువకుల్లో క్రీడా నైపుణ్యం పెంపుదలకు, యువ క్రీడా కారులను ప్రోత్సహించేందుకు తమ సంస్థ ఈ తరహా టోర్నమెంట్లను నిర్వహిస్తుందని సంస్థ ఎండి మురళీకృష్ణ స్పష్టం చేశారు. విజేతలను అభినందించార
టోర్నీ విజేతలతో దివీస్ సంస్థ ఎండి మురళీకృష్ణ