భౌతికకాయం వద్ద నివాళులర్పిస్తున్న నాయకులువక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ షేక్ మున్వర్ మృతిప్రజాశక్తి-నెల్లూరు సిటీ:నెల్లూరు జెండావీధికి చెందిన సేవాతత్పరుడు, వక్ఫ్బోర్డు మాజీ ఛైర్మన్ షేక్ మున్వర్ మృతి చెందారు. ఆయన మృతి అత్యంత బాధాకరమని టీడీపీ అగ్రనేతలు మంగళవారం విచారం వ్యక్తం చేశారు. జెండావీధిలోని మున్వర్ నివాసానికి రాజ్యసభసభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి, మాజీ మంత్రులు డాక్టర్ పొంగూరు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి, పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ రూప్కుమార్యాదవ్, టీడీపీ ముఖ్యనేతలు తరలి వెళ్లి మున్వర్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ… మంచి నేతగా ఎదుగుతున్న మున్వర్భారు లేని లోటు తీర్చలేనిదని బాధను వ్యక్తం చేశారు. మున్వర్ పరమపదించడం చాలా దిగ్భ్రాంతికి కలిగించిందని చెప్పారు. . అల్లాV్ా కరుణ కటాక్షలు ఆయన కుటుంబసభ్యులకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.