వైసిపి పాలనలో ప్రజలకు నష్టం

Feb 1,2024 21:35

ప్రజాశక్తి-విజయనగరం కోట  : వైసిపి పాలనలో ప్రజలు అన్ని విధాలా నష్టపోయారని టిడిపి నియోజక ఇన్‌ఛార్జి అదితి గజపతి అన్నారు. బాబు ష్యూరిటీ – భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గురువారం 24వ , 25వ డివిజన్‌లలో బూర్లెపేట, తారక రామకాలనీ, పిళ్ళా వారి వీధి, బెవర వీధి, రంగాల వీధి, మంగళి వీధి, బేతాళ వీధి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ హామీలను ప్రజలకు వివరించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాపాడాలంటే తెలుగుదేశం – జనసేన ప్రభుత్వం ఏర్పడాలని, అందుకు ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఐవిపి రాజు, పట్టణ అధ్యక్షులు ప్రసాదుల లక్ష్మీ వరప్రసాద్‌, విజయనగరం మండల పార్టీ అధ్యక్షులు బొద్దుల నర్సింగరావు కార్యదర్శి గంటా పోలినాయుడు, రాష్ట్ర బీసీ నాయకులు వేచలపు శ్రీనివాసరావు, కార్యాలయ కార్యదర్శి రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️