ప్రజాశక్తి – చీపురుపల్లి : ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు జన్మదిన వేడుకలను టిడిపి నాయకులు ఘనంగా నిర్వహించారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణంలో వైభవంగా నిర్వహించారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపేందుకు నాలుగు మండలాలకు చెందిన నాయకుల, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేయడంతో పాటు కార్యకర్తలకు మిఠాయిలను పంచి పెట్టారు. అనంతరం చీపురుపల్లి కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకపూజలను కళావెంకటరావు నిర్వహించారు. ఆలయ ఇఒ శ్రీనివాసరావు, ఆలయ ప్రధాన అర్చకులు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో విజయనగరం పార్లమెంటరీ నియోజకవర్గం అధ్యక్షులు కిమిడి నాగార్జున, నాలుగు మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/mla-kala.jpg)