చండ్ర మధుసూదన్‌, వెంకయ్యలకు సన్మానం

Jul 2,2024 21:51
చండ్ర మధుసూదన్‌, వెంకయ్యలకు సన్మానం

సన్మానిస్తున్న దృశ్యంచండ్ర మధుసూదన్‌, వెంకయ్యలకు సన్మానంప్రజాశక్తి-వరికుంటపాడు :తెలుగుదేశం పార్టీ కన్వీనర్‌ చండ్ర మధుసూదన్‌ రావు, మాజీ కన్వీనర్‌ చండ్ర వెంకయ్యలకు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మహమ్మద్‌ ఆసీఫ్‌ యువ నాయకులు మట్ల వినోద్‌ ఘనంగా సన్మానించారు. మంగళవారం పామూరులోని వారి స్వగృహంలో వారు మర్యాదపూర్వకంగా కలిసి శాసనసభ్యులు కాకర్ల సురేష్‌ ఘన విజయంకు కృషి చేసినందుకు వారిని శాలువాలు పూలమాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా విరువూరు గ్రామానికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మహమ్మద్‌ ఆసిఫ్‌ యువ నాయకులు మట్ల వినోద్‌ యాదవ్‌ మాట్లాడుతూ మెట్ట ప్రాంత అభివృద్ధి వలసలు నివారణ నిరుద్యోగ నిర్మూలన ఒక్క శాసనసభ్యులు కాకర్ల సురేష్‌ తోనే సాధ్యమన్నారు. ఆయన గెలుపునకు కృషి చేసిన వీరిని అభినందించడం సంతోషంగా ఉందన్నారు. ఉదయగిరి దశ దిశ మార్పు చేసేందుకు సొంత నిధులు లెక్కచేయని సేవమూర్తులైన ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి సారధ్యంలో ఉదయగిరి నియోజకవర్గ ప్రజల నిరుద్యోగులు వలసల నివారణ మహిళల అభివృద్ధి చేయగలిగే శాసనసభ్యులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించి పరిపాలన ముందుకు సాగాలని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.

➡️