7న పూర్వ విద్యార్థుల సమావేశం

7న పూర్వ విద్యార్థుల సమావేశం

 

శతవసంతాల వేడుక నిర్వహణపై 7న పూర్వ విద్యార్థుల సమావేశం

ప్రజాశక్తి -భీమునిపట్నం : స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏర్పడి వందేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా శతవసంతాల వేడుక నిర్వహణపై చర్చించేందుకు ఈనెల 7న పూర్వ విద్యార్థుల సమావేశం నిర్వహించనున్నట్లు హెచ్‌ఎం పొన్నగంటి రమణ తెలిపారు. సోమవారం స్థానిక పాఠశాలలో మాజీ కౌన్సిలర్‌, పాఠశాల పూర్వ విద్యార్థి మైలపల్లి లక్ష్మణరావు అధ్యక్షతన నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశం హెచ్‌ఎం మాట్లాడుతూ, 1924లో ప్రారంభించిన ఈ పాఠశాల నేటికి వందేళ్లు పూర్తిచేసుకుందన్నారు. వేడుకల నిర్వహణపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈనెల 7న సమావేశం నిర్వహిస్తామన్నారు. వేడుకల నిర్వహణ కన్వీనర్‌గా పూర్వ విద్యార్థి, కన్వీనర్‌ లక్ష్మణరావును ఏకగ్రీవంగా నియమించినట్లు తెలిపారు. సమావేశంలో పూర్వ విద్యార్థి గాడు అప్పలనాయుడు, విశ్రాంత ఉపాధ్యాయులు టి భీమారావు పాల్గొన్నారు

సమావేశంలో మాట్లాడుతున్న హెచ్‌ఎం రమణ

➡️