ప్రజాశక్తి – చీరాల
ఓ యువకుడు లాడ్జిలో బ్లేడుతో చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం రాత్రి పట్టణంలో వెలుగు చూసింది. అందిన వివరాల మేరకు.. తాడేపల్లికి చెందిన అయ్యప్ప (32) అనే యువకుడు చీరాల పట్టణంలోని సాయి కృష్ణ లాడ్జిలో బ్లేడుతో చెయ్యి నరాలు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు చీరాలలోని ఓ ప్రైవేట్ హౌసింగ్ బ్యాంకులో పనిచేస్తున్నట్లు సమాచారం. అయితే ఆత్మహత్యకు దారి తీసిన కారణాలు, ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న ఒకటవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు. యువకుని కుటుంబ సభ్యులకు సమాచారం అందజేసి మృతుకి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/IMG-20240701-WA1757.jpg)