ప్రజాశక్తి – అద్దంకి
ఎంఎల్ఎ గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నాయకుల అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నట్లు టిడిపి పట్టణ అధ్యక్షులు చిన్ని శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు పడుతున్న బాధలు, పెరిగిన ధరలు, భద్రత లేక మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఉపాధి, ఉద్యోగాలు లేక యువత పడుతున్న బాధలు, రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, ఇతర వర్గాలపై జగన్రెడ్డి, వైసిపి నేతలు సాగిస్తున్న దారుణాలకు గట్టిగా సమాధానం చెప్పేలా అన్ని వర్గాలకు అండగా నిలిచేలా టిడిపి సూపర్ సిక్స్ పేరుతో చంద్రబాబు ప్రకటించిన ఆరు హామీలను ప్రజల్లోకి తీసుకెళుతున్నట్లు తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/03/ADK-TDP.jpg)