ప్రజాశక్తి – కారంచేడు
కారంచేడు పంచాయతీ ప్రజలకు త్రాగునీరు అందిస్తున్న జయ ప్రకాష్ నారాయణ చెరువును పంచాయతీ కార్మికులు శుభ్రపరిచారు. గత కొంత కాలంగా చెరువులో ఉన్న నీరు కలుషితమై దుర్వాసన రావడంతో ఆ నీటిని తొలగించి చెరువులో మంచినీరు నింపడానికి ఏర్పాటు చేస్తున్నట్లు పంచాయతీ కార్యదర్శి కె అంజయ్య తెలిపారు.