ప్రజాశక్తి – చీరాల
మండలంలోని ఈపురిపాలెంకు చెందిన టీస్టాల్ నిర్వాహకుడు షేక్ సుభాని కుమార్తె షేక్ ఫాతిమా తీవ్ర కడుపు నొప్పితో ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఆమె వైద్య ఖర్చులకు రూ.70వేలకుపైగా ఖర్చు అవుతుందని వైద్యులు తెలపారు. దీంతో దిక్కు తోచని స్థితిలో ఆమె పద్మ భాస్కర్ ఫౌండేషన్ను ఆశ్రయించగా ఫౌండేషన్ చైర్మన్ ఘంటా అనిల్ కుమార్ స్పందించి రూ.6వేల నగదును అందజేశారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/IMG_20240701_205350.jpg)