ప్రజాశక్తి – కర్లపాలెం
మండలంలోని పేరలిపాడు గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ మోహన్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. అతని కుటుంబానికి రూ.17వేలు కర్లపాలెం ఫోటోగ్రాఫర్స్ అందరూ కలిసి ఆర్థిక సహాయం గురువారం అందజేశారు. కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్స్ శ్రీనివాసరెడ్డి, ప్రసాద్, అశోక్, ఫోటోగ్రాఫర్స్ అండ్ వీడియో గ్రాఫర్స్ పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2023/12/KARLAPALEM-1.jpg)