ప్రజాశక్తి – చెరుకుపల్లి
గ్రామానికి చెందిన పత్రిక విలేకరి యెనుమల వెంకటేశ్వరరావు గౌడ్ నూతన గృహాన్ని తెలుగుదేశం నాయకులు ఇళ్లు కూల్చివేసిన ఘటనలో విలేఖరికి వైసీపీ ఇన్చార్జి డాక్టర్ ఈవూరి గణేష్ ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ గణేష్ మాట్లాడుతూ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇంటిని తెలుగుదేశం నాయకులు దగ్గరుండి కూల్చి వేయించడం దారుణమని అన్నారు. ప్రజా స్వామ్యంలో బ్రతుకుతూ ఇటువంటి నీచ రాజకీయాలు చేయడం దారుణమని అన్నారు. కార్యకర్తకు తాను అండగా ఉంటానని అన్నారు. నియోజకవర్గంలో జరిగే దాడుల గురించి ఎప్పటికప్పుడు మాజీ సిఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకు వెళుతున్నామని అన్నారు. త్వరలోనే బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు జగన్మోహన్రెడ్డి వస్తారని, అధైర్య పడవద్దని తెలిపారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/Cherukupalli-YCP.jpg)