ప్రజాశక్తి – పర్చరు
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో వికలాంగురాలైన వ్యక్తికి వీల్ చైర్ అందజేశారు. యర్రా లక్ష్మీ సౌఖ్య ఆర్ధిక సహాయంతో వీల్ఛైర్ అందజేసినట్లు క్లబ్ అధ్యక్షుడు నాగబైరు శ్రీనివాసరావు తెలిపారు. వికలాంగులకు అవసరమైన సహాయం ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ చేతులు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కాళ్ళు కోల్పోయిన వారికి గుంటూరులో 21న కృత్రిమ పాదములు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అవసరమైన వారు తమను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి పంబి సదానందరెడ్డి, సీనియర్ సభ్యులు కొల్లా నరేంద్ర కుమార్, పాబోలు ఉదయ్ భాస్కర్. కొల్లా శివ రామ కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/PRC-Rotary.jpeg)