రోటరీ క్లబ్ అధ్యక్షునిగా కృష్ణమోహన్

Jul 3,2024 00:35 ##Parchuru #Rotary

ప్రజాశక్తి – పర్చూరు
రోటరీ క్లబ్ నూతన అధ్యక్షునిగా మండలంలోని దేవరపల్లికి చెందిన తోకల కృష్ణమోహన్ ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక రోటరీ భవన్లో జరిగిన 2024-2025 నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. కార్యదర్శిగా కోమటి ఆంజనేయులు, కోశాధికారిగా పంబి సదానందరెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. నూతన కమిటీ సభ్యులకు మాజీ రోటరీ సభ్యులు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. అడుసుమల్లి గ్రామ పంచాయితీకి హరిప్రసాద్‌ చేతుల మీదుగా చెత్త రిక్షాను అందజేశారు. కార్యక్రమంలో జాష్టి రంగారావు, అన్నె రత్నప్రభాకర్, ఎం హరిహర ప్రసాద్, ఎల్ రఘురామిరెడ్డి, ఎస్ దినేష్‌రెడ్డి, కె రామకోటయ్య, తేళ్ల రమేష్ చంద్ర, కొల్లా నరేంద్ర కుమార్, కొల్లా శివరామకృష్ణ ప్రసాద్, నాగభైరు శ్రీనివాసరావు, గడ్డిపాటి శ్రీనివాసరావు, రావి సత్యనారాయణ, పాబోలు ఉదయ్ భాస్కర్, కోటా శ్రీనివాసరావు, పాబోలు వెంకన్న, భవనం రాజగోపాలరెడ్డి, కాల్వ సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️