ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దాం : యుటిఎఫ్

Jul 3,2024 00:38 ##Karlapalem #UTF

ప్రజాశక్తి – కర్లపాలెం
ప్రభుత్వ బడులను బలోపేతం చేద్దామని, బడి ఈడు గల పిల్లల్ని ప్రభుత్వ బడిలో చేర్పిదామని యుటిఎఫ్ జిల్లా కోశాధికారి ఎం వెంకటేశ్వరరెడ్డి అన్నారు. మండలంలో యుటిఎఫ్ సభ్యత నమోదు ప్రారంభించారు. యుటిఎఫ్ మండల అధ్యక్షులు బివి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ఎం వెంకటేశ్వరరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి వైవి నారాయణ మాట్లాడారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించుటలో, సామాజిక స్పృహ కల్పించడంలో యుటిఎఫ్ ముందంజలో ఉంటుందని అన్నారు. వివిధ పాఠశాలలను దర్శించి సభ్యతం నమోదు చేయించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ మండల ప్రతినిధులు ఈ పోలీసురావు, సిహెచ్ ప్రభాకర్, జె డేవిడ్, ఎం గణపతిరెడ్డి, జి శ్రీనివాసరావు, వి రాఘవేంద్ర, బాబుజిరెడ్డి, పి ఉషకిరణ్, బి శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️