తార్కిక ఆలోచనా ధోరణిని అలవాటు చేసుకోవాలి

Jul 2,2024 00:37 ##Vetapalem #StANNsCollege

ప్రజాశక్తి – వేటపాలెం
పాలిటెక్నిక్ విద్యార్థులు తాత్విక ఆలోచన ధోరణి అలవాటు చేసుకోవాలని సెయింట్‌ ఆన్స్‌ ఇంజనీరింగ్‌ కళాశాల సెక్రెటరీ వనమా రామకృష్ణారావు, కరస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. తమ కళాశాల్లో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరంలో చేరిన విద్యార్ధుల పరిచయ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ సెయింట్ ఆన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో చేరటం విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం అని, సద్వినియోగ చేసుకోవాలని తెలిపారు. పాలిటెక్నిట్ విద్యార్ధులు ఎక్కువ నైపుణ్యం ప్రదర్శించగలరని తెలిపారు. అనుభజ్ఞులైన అధ్యాపకులు కళాశాల్లో చేరిన ప్రతి విద్యార్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్ధులు కమ్యునికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.

➡️