వైద్య రంగాన్ని అభివృద్ధి చేస్తా : ఎమ్మెల్యే కొండయ్య

ప్రజాశక్తి – చీరాల
వైద్య రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ వైద్యులందరికీ అండగా ఉంటానని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. జాతీయ వైద్య దినోత్సవం సందర్భంగా ఐఎంఎ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో స్థానిక ఐఎంఏ హాలులో ఆయన మాట్లాడారు. బెంగాల్‌ మాజీ సిఎం, సీనియర్ వైద్యులు డాక్టర్‌ బీసీ రాయ్ చిత్రపటానికి వైద్యులతో కలసి నివాళి అర్పించారు. తనపై నమ్మకంతో గెలిపించారని, తన గెలుపులో వైద్యల భాగస్వాం కావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈసందర్భంగా ప్రజాశక్తి ప్రచురించిన వైద్య, ఆరోగ్య ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సీనియర్ వైద్యులను సన్మానించారు.

➡️