ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండలంలోని ఐలవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రూ.4వేలకు పెన్షన్ పెంచడం అభినందనీయమని టిడిపి నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు మాచర్ల నాగరాజు, దీపాల ప్రసాదు, జొన్నాదుల రెడ్డియ్య, డోలా శివకుమార్, జగ్గారపు పాపారావు, వామనపల్లి కోటేశ్వరరావు పాల్గొన్నారు.