పోరాటం వైసీపీకి కొత్త కాదు

ప్రజాశక్తి – బాపట్ల
ప్రజా సమస్యలపై పోరాటం వైసిపికి కొత్తేమీ కాదని మాజీ ఎంఎల్‌ఎ కోన రఘుపతి అన్నారు. కార్యకర్తలు అధైర్య పడొద్దని అన్నారు. జగనన్నను మళ్ళీ సిఎంని చేద్దామని అన్నారు. స్థానిక వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తలు సమావేశంలో ఆయన సోమవారం మాట్లాడారు. పార్టీ ఓటమికి జగన్మోహన్‌రెడ్డిని నిందించటం సరికాదన్నారు. అనేక లోపాలను సమీక్ష చేసుకొని ప్రజలకు మరింత సంక్షేమాన్ని అందించే విధంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. తాను నిత్యం కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని అన్నారు. కార్యక్రమంలో ఎఎంసి మాజీ చైర్మన్ సీతారామిరెడ్డి, సర్పంచ్ మాడా సుబ్రహ్మణ్యం, గవిని కృష్ణమూర్తి, రాఘవరెడ్డి, కాగిత సుధీర్ బాబు, యల్లావుల ఏడుకొండలు పాల్గొన్నారు.

➡️