ప్రజాశక్తి – చీరాల
రేషన్ బియ్యం అక్రమ నిల్వల సమాచారంతో విజిలెన్స్ అధికారులు సోమవారం రాత్రి దాడులు చేశారు. దండుబాట రోడ్డులోని జాలమ్మ గుడి వద్దనున్న వెంకటేశ్వరరావుకు చెందిన 31వ షాపు, కట్టా హెలిన్కు చెందిన 32వ షాపులో అధికారులు తనిఖీలు చేశారు. 31వ షాపులో 91 క్వింటాళ్లకు గాను 65బస్తాలు, 32వ షాపులో 114.50 క్వింటాళ్లకు గాను 30బస్తాలు తగినట్లుగా అధికారులు నిర్ధారించారు. ఆయా షాపుల్లో మిగిలిన రేషన్ బియ్యాన్ని 34, 26 రేషన్ దుకాణాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. షాపు నిర్వాహకులు వెంకటేశ్వరరావు, కట్టా హెలిన్పై 6ఏ, క్రిమినల్ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో విజిలెన్స్ సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ రామచంద్రరావు, డిటి శరత్ పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/CRL-Ration.jpg)