గ్రామీణ పాలనలో నూతన ఒరవడిశ్రీ ఏ రాష్ట్రంలో సాధ్యంకాని సంక్షేమం ఏపీలో అమలైందిశ్రీ జెడ్పీ ఛైర్మన్ శ్రీనివాసులుప్రజాశక్తి-చిత్తూరుఅర్బన్: వైసీపీ ప్రభుత్వంలో గ్రామీణ పాలనలో నూతన ఒరవడి సంతరించుకున్నదని జెడ్పీ ఛైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు అన్నారు. సోమవారం చిత్తూరు సీఎంఎస్ఎస్ కార్యాలయంలో సచివాలయ ఉద్యోగులకు నాలుగు రోజులు పాటు డిజిటలైజేషన్, సుస్థిరాభివృద్ధి, సర్వీస్ రూల్స్ గురించి నిర్వహించే సదస్సును జెడ్పీ ఛైర్మన్, జెడ్పీ సీఈఓ ప్రభాకర్రెడ్డి, డిఎల్డిఓ రవికుమార్లతో కలిసి ప్రారంభించారు. జెడ్పి ఛైర్మన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి లక్ష మందికి పైగా ఉద్యోగాలను ఏకకాలంలో కల్పించి గ్రామీణ స్థాయిలో ప్రజల ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు సీఎం జగన్మోహన్రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా 536కు పైగా సేవలను అందించడం జరుగతోందన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా అత్యంత పారదర్శకంగా అన్ని సంక్షేమ అభివద్ధి పథకాలు అర్హులందరికీ చేర్చడం జరుగుతోందన్నారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు ఈ వ్యవస్థ పని తీరును పరిశీలించడం జరిగిందన్నారు. సీఈఓ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో సేవలు అందిస్తున్న సచివాలయ ఉద్యోగులు సుస్థిరాభివృద్ధి సూచికలు, డిజిటలైజేషన్, సర్వీస్ రూల్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్ర స్థాయిలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు ఇటువంటి అవగాహన కార్యక్రమాలు అవసరమన్నారు. టిసిఐఎల్ కార్యదర్శి లలితమ్మ మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగులకు డిజిటలైజేషన్, సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు, పేదరికం రూపుమాపేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి, సర్వీస్ రూల్స్ గురించి అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. సచివాలయ ఉద్యోగుల అందరికీ ఈ కార్యక్రమాన్ని మరో 52 రోజులపాటు వివిధ ప్రాంతాలలో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని 31 మండలాల నుంచి పలువురు సచివాలయ కార్యదర్సులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.