పంటలపై అడవి పందుల దాడిప్రజాశక్తి- గుడిపల్లి: మండలంలోని అగరం గ్రామ పంచాయతీకి చెందిన లక్ష్మీపతి అనే రైతుకు చెందిన మొక్కజకొన్న పంటను సోమవారం రాత్రి అడవి పందులు దాడి చేసి ధ్వంసం చేశాయి. మొక్కజొన్న కంకులను పూర్తిగా తినేసి, మొక్కలను తొక్కి నాశనం చేశారు. పందుల దాడి వలన రూ.15వేలు పంట నష్టం వచ్చిందని రైతు పేర్కొన్నారు. సంబంధిత అధికారులు స్పందించిన పంట నష్టాన్ని అందించాలని కోరారు.
![పంటలపై అడవి పందుల దాడి](https://prajasakti.com/wp-content/uploads/2024/01/33444455556666.jpg)