ప్రజాశక్తి-విజయనగరంకోట : మండలంలోని ద్వారపూడి గ్రామంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని ఎమ్మెల్యే పి.అదితి విజయలక్ష్మి గజపతిరాజు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగాగ్రామానికి తొలిసారి వచ్చిన ఎమ్మెల్యేకు నాయకులు, గ్రామస్తులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇక్కడ సర్పంచ్లు, వార్డు సభ్యులు ఉన్నప్పటికీ గత ప్రభుత్వం ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోవడం చూసి కోర్టు ద్వారా వారి హక్కులను తెచ్చుకున్నామని తెలిపారు. గ్రామాన్ని దత్తత తీసుకొని ఆదర్శ గ్రామంగా అశోక్గజపతిరాజు అభివృద్ధి చేశారని తెలిపారు. తన తండ్రి బాటలోనే నడుస్తూ ఈ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ వై.ఆదిలక్ష్మి, మాజీ సర్పంచ్ వై.శ్రీనివాసరావు, బొద్దల నర్సింగరావు, శ్రీనివాసరాజు, ఎం.సూరిబాబు, రామానుజులు, అర్. అప్పలనాయుడు, ఐవిపి.రాజు, రాజేష్ బాబు, గంటా పోలినాయుడు, వేచలపు శ్రీనివాసరావు, అవనాపు విజరు పిల్లా విజరు కుమార్, గాడు అప్పారావు, ఎంపిడిఒ, తహశీల్దార్, ఎఇ, జెఇ పాల్గొన్నారు.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/07/vzm-mla.jpg)