ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (రాయచోటి-అన్నమయ్య) : పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ను ఊటుకూరు మాజీ సర్పంచ్ మన్నేరు లక్ష్మీ నరసయ్య మంగళవారం విజయవాడలో మర్యాదపూర్వకంగా కలిశారు. అలాగే జనసేన నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్న పి.హరిప్రసాద్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. వారిద్దరిని పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.