ఫొటో : పెన్షన్లు అందజేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి
పెన్షన్లు అందజేత
ప్రజాశక్తి-ఎఎస్పేట : ఎఎస్పేటలో సోమవారం ఎన్టిఆర్ పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఎన్నికల సమయంలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే మాట ప్రకారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెన్షన్ల పెంపుపై తొలి సంతకాన్ని పెట్టిన వ్యక్తి అని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం మంత్రి ఆనం రామనారాయణరెడ్డి చేతులమీదుగా పింఛన్దారులకు ఎన్టిఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశామన్నారు. కార్యక్రమంలో ఆత్మకూరు మాజీ ఎంఎల్ఎ కొమ్మి లక్ష్మయ్య నాయుడు, టిడిపి సీనియర్ నాయకులు తాళ్లూరు గిరినాయుడు, కాటంరెడ్డి రవీంద్రారెడ్డి, ఆర్డిఒ మధులత, మండల టిడిపి కన్వీనర్ అబ్బూరు రమేష్ నాయుడు, రాజవోలు సొసైటీ మాజీ అధ్యక్షుడు కాటంరెడ్డి నరసింహారెడ్డి, నంది వివేకానంద రెడ్డి, కంచర్ల శ్రీహరి నాయుడు, ఎఎస్పేట సర్పంచ్ షేక్ జిలాని భాషా, షేక్ షబ్బీర్, పెద్దభిపురం సర్పంచ్ అల్లంపాటి మాధవరెడ్డి, నాయకులు ఏలూరు మాల్యాద్రినాయుడు, మాజీ సర్పంచ్ డాక్టర్ షేక్ ఖాజామియా, నరసయ్య, షేక్ ఖాదర్బాషా, మదనయ్య, వెంకటేశ్వర్లు, తహశీల్దార్ రవికుమార్, ఎంపిడిఒ వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు.
![ఫొటో : పెన్షన్లు అందజేసిన మంత్రి ఆనం రామనారాయణరెడ్డి](https://prajasakti.com/wp-content/uploads/2024/07/asp-1.jpg)