పేదలందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

ప్రజాశక్తి-సిఎస్‌ పురంరూరల్‌: పేదలందరికీ వెంటనే ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం మండల కార్యదర్శి ఊసా వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. సోమవారం సిఎస్‌ పురంలోని పాముల వారి కాలనీలోని ప్రజలతో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్‌ పట్టలతో వారు ఏర్పాటు చేసుకున్న నివాస గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిపిఎం పోరాటాల ఫలితంగా దాదాపు 12 సంవత్సరాల క్రితం కొద్దిమంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని, ఆ తర్వాత ఏ ప్రభుత్వం కానీ, అధికారులు కానీ పేదల గురించి పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు. పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని పలుమార్లు ఎమ్మెల్యేగా దృష్టికి తీసుకెళ్లామని, రెవెన్యూ అధికారులకు అర్జీలు కూడా ఇచ్చామని, ఏ ఒక్కరు కూడా పేద ప్రజల సంక్షేమం గురించి పట్టించుకోలేద న్నారు. ప్రస్తుతం చంద్రబాబు పాలనపై పేద ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ఈ ప్రభుత్వమైనా పేద ప్రజల గురించి పట్టించుకుని వారికి ఇళ్ల స్థలాలు ఇచ్చి పక్కా గృహాలు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నరసింహులు, తిరుపతమ్మ, పోలయ్య పాల్గొన్నారు.

➡️